అమరలింగేశ్వర స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్తున్న రైతుకు చేదు అనుభవం ఎదురైంది. అమరావతి రైతుల ఆందోళనలో అపశ్రుతి ఎదురయ్యింది. మొక్కులు చెల్లించు కునేందుకు వెళుతున్న రైతు పైకి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్‌ లోని ఓ కారు దూసుకెళ్లింది. అయితే.. ఆదివారం సాయంత్రం అమరలింగేశ్వర స్వామి రథోత్సవం ఉండటంతో వైఎస్ఆర్ సీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు అందరు ఆలయానికి వెళ్లారు. కాగా., ఈ క్రమంలోనే ఎంపీ నందిగం సురేష్ కూడా బయలు దేరి ఆలయానికి వెళుతున్నారు.

 

అయితే.. వెలగపూడి, తుళ్ళూరు నుంచి కొంత మంది రైతులు, మహిళలు మొక్కులు చెల్లించు కునేందుకు ప్రజా ప్రతినిధులతో పాటూ.. రథోత్సవంలో పాల్గొనేందుకు అందరు ఆలయానికి బయలు దేరారు. పోలీసులు వారిని ఆలయానికి కొద్ది దూరంలో అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఉండటంతో నడిచి వెళ్లాలని రైతులకు చెప్పారు. దీంతో వారు అందరు ర్యాలీగా ఆలయం వైపుగా కదిలారు.

 

ఇంతలో ఎంపీ సురేష్ కారు ఆలయం వైపుగా వచ్చింది. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో.. ఆ బస్సును తప్పించే క్రమంలో ఎంపీ సురేష్ కాన్వాయ్‌ లోని వాహనం ర్యాలీగా వెళ్తున్న వారిలోని ఓ రైతు కాలుపైకి ఎక్కింది. ఆయన కాలికి గాయం కావడంతో అక్కడే ఉన్న తోటి రైతులు అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి  తరలించారు. ఎంపీ రైతుకు గాయమైనా కారు ఆపకుండా వెళ్లిపోయారని రైతులు, ప్రజాప్రతినిధులు  మండిపడ్డారు. కారు కాలిపై ఎక్కడంతో ఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తోంది.

 

అయితే.. రైతు కాలికి తీవ్రంగా గాయమైన కనీసం ఆ బాధితుడిని పరామర్శించకుండా వెళ్లిపోయారని రైతులు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఎంత అధికారంలో ఉంటె ఏంటి..?? ఎంత మంత్రి అయితే ఏంటి..?? గాయపరిచిన రైతును పరామర్శించక పోవటం అక్కడి స్థానికులను కూడా ఆగ్రహానికి గురి చేస్తోంది. ఓ మంచి పదవిలో ఉండి ప్రజల అవసరాలను, కష్టాలను తీర్చాల్సింది పోయి ఇలా గాయపరిచి పట్టించుకోకుండా వెళ్ళిపోవటం పలువురి ఆగ్రహానికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: