అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటన వేళ అన్ని మీడియాల్లోనూ ఇదే ప్రధాన వార్తగా మారింది. ఆయన పర్యటనపై సోషల్ మీడియాలో కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ట్రంప్ తన పర్యటనలో ప్రధాని మోడీని ఓ ప్రశ్న ఎక్కడ అడుగుతారో అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భయపడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

 

ట్రంప్ పర్యటనకూ.. చంద్రబాబుకూ లింకేంటి.. అసలు ట్రంప్ చంద్రబాబు గురించి ఎందుకు అడుగుతారు.. అనుకుంటున్నారా. ఎందుకంటే.. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో చంద్రబాబు ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. చంద్రబాబు హిల్లరీ క్లింటన్ కు మద్దతు ఇచ్చారు. ట్రంప్ ను ఓడించాలంటూ అమెరికాలో ఉన్న ఇండియన్లకు పిలుపు ఇచ్చారు. అయితే చివరకు హిల్లరీపై ట్రంపే గెలిచారు.

 

ఇప్పుడు ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో ఆయన నన్ను ఓడించిన చంద్రబాబు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నట్టు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అసలు ట్రంప్‌ విమానం దిగగానే చంద్రబాబు ఎక్కడా అని అడిగినట్లు కామెడీ బొమ్మలు క్రియేట్ చేసి జోకులు వేస్తున్నారు. అమెరికాలో నన్ను ఓడిస్తానన్న చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారంటే జోలె పట్టుకొని తిరుగుతున్నారని సమాధానం చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

అంతే కాదు.. చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా అని కూడా ట్రంప్‌ అడిగినట్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తన గురించి ట్రంప్ ఎక్కడ మోడీని అడుగుతారో అని చంద్రబాబు భయపడిపోతున్నట్టు కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఇంత బిజీ పర్యటనలో ట్రంప్ చంద్రబాబును గుర్తు పెట్టుకునే అవకాశాలే లేవు లెండి. ఆ విషయంలో చంద్రబాబు నిశ్చింతగా ఉండొచ్చంటున్నారు మరికొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: