ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిల పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే, ఈ మధ్య జంతువులను కూడా వదలట్లేదు ఈ కీచకులు. మొన్నామధ్య ఓ కామాందుడు లేగ దూడ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దేశంలో నిత్యం మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించినా కామాంధుల్లో ఎలాంటి భయాలను కలిగించలేకపోతున్నాయి. 

 

 

 

ఇప్పటివరకు మహిళలకే రక్షణ లేదనుకుంటుంటే మూగజీవాలను కూడా వదలడం లేదు కొందరు కామ పిశాచులు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లాలో ఓ వ్యక్తి మేకపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.ఓ గ్రామానికి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకలను పెంచుతూ కుటుంబాన్న పోషిస్తున్నాడు. రెండ్రోజుల క్రితం అతడు రాత్రి సమయంలో ఓ మేకను ఇంటి బయట కట్టేసి బయటకు వెళ్లాడు. 

 

 


అయితే, కాసేపటి తర్వాత మేక అరుస్తుండటంతో పక్కింట్లో ఉండే ఓ వ్యక్తి అటువైపు చూశాడు. ఓ వ్యక్తి తాగిన మత్తులో మేకపై అత్యాచారానికి పాల్పడటం చూసిన పక్కింటి వ్యక్తి స్థానికులను అప్రమత్తం చేశాడు.కొద్దీ సేపు తర్వాత అతన్ని పట్టుకొని చితకబాదారు. మేక మీద లైంగిక దాడికి పాల్పడతావా అంటూ అతడిని తీవ్రంగా కొట్టారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నానో తెలియకపోవడం వల్లే అలా చేశానని, వదిలేయాలని ఆ వ్యక్తి వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. 

 

 

విషయానికొస్తే.. తీవ్రంగా కొట్టడంతో నిందితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో అతడి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.తీవ్ర రక్త స్రావం కావడంతో పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇన్ని రోజులు చిన్నారులకు, అమ్మాయిలకు రక్షణ లేదు.. ఇప్పడు మూగజీవాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: