మానవ సంబంధానికి మచ్చతెచ్చేలా నీచపు పనికి పాల్పడ్డాడో కామాంధుడు. తల్లితో రాసలీలలు సాగిస్తూనే కూతురిపై కన్నేసి.. ఆమెను తొమ్మిది మందికి తల్లిని చేశాడు. ఈ దారుణ ఘటన అమెరికాలోని ఓక్లహామాలో వెలుగుచూసింది.
ఓక్లహామా రాష్ట్రానికి చెందిన హెన్రీ మైకేల్ పిప్పీ(65) అనే వ్యక్తి ప్రియురాలితో సహజీవనం చేసేవాడు. తల్లితో రాసలీలలు కొనసాగిస్తూనే ఆమె కూతురు రొసాలిన్ మెక్గిన్నిస్పై కన్నేశాడు. ఎలాగైనా రొసాలిన్ను దక్కించుకోవాలనుకుని ఆమెకు పన్నెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు కిడ్నాప్ చేశాడు. ఎవరికీ తెలియకుండా ఆమెను నిర్బంధించాడు.
మూడేళ్ల గడచిన తరువాత పదిహేనేళ్ల వయస్సులో 2000 సంవత్సరంలో ఆమెపై తొలిసారి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి ఆమెను పలుమార్లు లైంగికంగా వేధించాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఆమెను నిర్బంధించి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు. ఏళ్ల తరబడి ఆమెపై పడి కామవాంఛలు తీర్చుకున్నాడు. సవతి తండ్రి కారణంగా ఆమె తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది.
మైకేల్ ఆమెను జనం గుర్తుపట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఆమె పేర్లు మార్చి ఊరూరా తిప్పుతూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లే సమయంలో ఆమె తన గర్ల్ ఫ్రెండ్ కూతురని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడేవాడు. ఆమెను ఓక్లహామా, మెక్సికోలోని పలు ప్రాంతాల్లో ఉంచి ఆమెతో సంబంధం కొనసాగించాడు.
రొసాలిన్ ఓ రోజు ధైర్యం చేసి అతని నుంచి తప్పించుకుని పారిపోయింది. అనంతరం తన పిల్లలతో కలసి మెక్సికోలోని యూఎస్ కాన్సుల్ అధికారికి ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి తొమ్మిది మంది పిల్లలకు తల్లిని చేశాడని వాపోయింది.
సవతి తండ్రి మైకేల్పై కేసు నమోదైంది. కూతురిని ఎత్తుకెళ్లి ఇరవై ఏళ్లుగా అత్యాచారం చేయడం.. తొమ్మిది మంది పిల్లలకు తల్లిని చేయడాన్ని న్యాయస్థానం సీరియస్గా స్పందించింది. తీవ్రమైన నేరంగా పరిగణించి జీవిత ఖైదు, భారీగా జరిమానా విధించింది.