ఈరోజుల్లో లవ్ మ్యారేజ్ అయితే సరే సరి. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే, కాస్త ఆలోచించాల్సిందే సుమా! అవును. ఇక్కడ జరిగిన తంతు విన్న తరువాత మీకు సేమ్ ఫీలింగ్ కలగక మానదు. సరిగ్గా, తాళికట్టే సమయానికి వధువు బాంబ్ పేల్చడంలో ఏకంగా పెళ్లి ఆగిపోయిన ఘటన వనపర్తి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే, కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే యువకుడికి అదే మండలం పామాపురం గ్రామానికి చెందిన నందిని అనే యువతితో వివాహం నిశ్చయించారు. 

\r\n

\r\n

\r\n

\r\n

శుక్రవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రలుతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. వధూవరులు నెత్తిపై జీలకర్ర పెట్టే సమయంలో వధువు నందిని, అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేస్తూ, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఖరాకండిగా చెప్పింది. దీంతో పెళ్లికి వచ్చినవారంతా షాకయ్యారు. తన మేనమవను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నందిని పెళ్లి నిరాకరించిందని తెలిసి, సదరు మేనమవను అందరూ చితకబాదారు. 

\r\n

\r\n

దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను కూల్ చేసి, వారికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. వధువు తన మేనబావను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని చెప్పడంతో.. వరుడు తరపువారు మండపం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడిన పోలీసులు నందినికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని సూచించారు.

\r\n

\r\n

\r\n

\r\n

ఇటీవల ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. మొన్నటికి మొన్న పెళ్లి చీర వలన ఒక పెళ్లి ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని హాసన్ అనే ప్రాంతంలో పెళ్లి కొడుకు తరుపు వారు తెచ్చిన పెండ్లి చీర బాగా ఖరీదు తక్కువ అయినందువలన సదరు పెళ్లి కూతురు తరుపు వారు గొడవకు దిగి, మొత్తం పెళ్ళినే క్యాన్సిల్ చేసుకున్న సంఘటన అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేసింది.

\r\n

మరింత సమాచారం తెలుసుకోండి: