సొంత బావే తన మరదలిని కిడ్నాప్ చేసి తన ఫ్రెండ్స్ తో సామూహిక అత్యాచారం పాల్పడిన ఘటన చాన్హో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జార్ఖండ్రాజధాని రాంఛీ నగరంలో ఓ కామాంధుడు తన మరదలిని 15 రోజుల క్రితం మరదలిని కిడ్నాప్ చేసి వ్యక్తి 15 మంది ఫ్రెండ్స్‌తో కలిసి ఆమెపై అనేకసార్లు అత్యాచాారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

 

గురువారం సాయంత్రం రోడ్డు పక్కన అర్ధనగ్నంగా నిస్సహాయ స్థితిలో యువతిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై అనేకసార్లు గ్యాంగ్ రేప్ జరిగినట్లు తేలడంతో అంతా షాకయ్యారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

 

తమ కూతురు 15 రోజులుగా కనిపించడం లేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. తమ కూతురిని మేనల్లుడే కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురిపై కన్నేసిన అతడు చాలా రోజులుగా వేధిస్తున్నాడని తెలిపారు. 15 రోజుల క్రితం ఆమెకు కిడ్నాప్ చేసి బంధించి ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారం చేశాడని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు అతడి 15 మంది స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మహిళల రక్షణ కొరకు ప్రభుతం కొత్త చట్టాలను తీసుకొచ్చినప్పటికీ వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ఎదో ఒక్క ప్రాంత్రంలో రోజుకో ఘటన వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ సంఘటనలను అరికట్టడానికి దేశంలో మరికొన్ని కఠిన చర్యలు తీసుకుంటే కొంత వరకు అయినా ఈ ఆగడాలను అరికట్టవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: