తమిళ నాడు చెన్నైలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ రౌడీ షీటర్ ను అతి కిరాతకంగా దారుణంగా చంపారు.. ఈ ఘటన ప్రస్తుతం చెన్నై ని కదిలించి వేస్తుంది.. చెన్నైలోని కాసిమేడులో దారుణం జరిగింది. దివాకర్ అనే రౌడీషీటర్ని అతి కిరాతకంగా కొందరు వ్యక్తులు నరికి చంపేశారు. నడిరోడ్డుపైనే ఈ దారుణం జరుగుతున్నా ఒక్కరు కూడా పట్టించుకోకుండా ఎవరి పని వారు చూసుకున్నాడు. దుండగుల దాడితో షాకైన అతని ఫ్రెండ్ ను దారుణంగా హత్య చేయడంతో అక్కడి నుంచి హుడాయించాడు.
వివరాల్లోకి వెళితే.. చెన్నై కాసిమేడు లో నివసిస్తున్న దివాకర్ పై అనేక కేసులున్నాయి. దీంతో పోలీసులు అతడి పై రౌడీషీట్ తెరిచారు. శుక్రవారం రాత్రి ఇంటి బయట స్నేహితుడి తో మాట్లాడుతున్న దివాకర్ పై కొందరు దుండగులు ఆకస్మాతు గా దాడి చేశారు. కత్తుల తో విచక్షణా రహితం గా నరికి చంపేశారు. ఈ ఘటన దగ్గర్లో ని సి సి కెమారాలల్లో ఫుటేజ్ పరంగా అదుపులో కి తీసుకునన్నారు.
ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దివాకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు.
నది రోడ్డు పై ఒక మనిషిని అతి కిరాతకంగా నరికి చంపడం ఆశ్చర్యానికి గురిచేసిన కూడా ఎవరికీ పట్టించుకోక పోవడం గమనార్హం. అయితే కేసును నమోదు చేసుకున్న పోలీసులు దేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు,సీ సిఫుటేజ్ ఆధారంగా కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి తెలియాల్సి ఉంది