హైదరాబాద్ ... అంటే ఎన్నో అందాలకు.. అద్భుతాలకు కేరాఫ్ అన్న విషయం తెలిసిందే.. మానవ సృష్టికి అద్దం పట్టేలా ఉండి చూపరులను ఆకర్షిస్తూ వస్తుంది. ఎంత అందంగా ఉంటుందో అంతకు మించిన విదంగా నడిరోడ్డు మీద మర్దర్లు కూడా జరుగుతూ నగర ప్రజలను భయ బాంత్రులకు గురయ్యేలా చేస్తుంది. అందుకే పొదిగిన దీంట్లో కూడా భయాలు ఘోరాలు కూడా చవిచూస్తున్నాయి . ఇకపోతే ఈ ఏడాదిలో హైదరాబాద్లో ఘోరాలు జరుగుతున్నాయి.
ప్రేమించిన ప్రేమికులను నడి రోడ్డుపై నరికిన తల్లి తండ్రులు ఉండగా.. మరో ఊహించని విదంగా రోడ్డు ప్రమాదాలు.. జరుగుతున్నాయి.. కళ్ళు మూసుకొని తెరిచే లోగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో వైపు చిన్న పెద్ద సెల్ఫోన్లు వాడుతూ ప్రలోభాలకు గురవుతున్నారు . వివరాల్లోకి వెళితే ఓ చిన్నారి ఫోన్ ఇవ్వలేదని చనిపోవడానికి సిద్దమయ్యాడు. చిన్నారులపై సెల్ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ ప్రభావంతో అనర్థాలు జరుగుతున్నాయి.
గేమ్ ఆడుకోవడానికి సెల్ఫోన్ ఇవ్వలేదన్న కారణంతో అలిగి అపార్ట్మెంట్ పైనుంచి బాలుడు దూకేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. మియాపూర్కి చెందిన బాలవెంకట సత్యప్రసాద్త ల్లిదండ్రలుతో కలసి స్వప్న నిర్వాణ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు.సెల్ఫోన్ గేమ్స్కు అలవాటుపడిన సత్యప్రసాద్కు ఫోన్ ఇచ్చేందుకు తండ్రి నిరాకరించాడు.
నిత్యం ఫోన్, ట్యాబ్లో గేమ్స్ ఆడుతుండడంతో కొడుకుని తీవ్రంగా మందలించాడు. ఆడుకునేందుకు ట్యాబ్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన సత్యప్రసాద్ అపార్ట్మెంట్ పైనుంచి దూకేయడంతో వెంటనే ప్రాణాలు కోల్పోయి కన్నా ప్రేగుకు శోకాన్ని మిగిల్చాడు.. చిన్న పిల్లలను బాగా చూసుకోవాలి కానీ వారు అడిగిన వాటికి ఎదో అనుకోని అడిగిన వన్నీ కొనివ్వకూడదు. పిల్లలు అంటే అలానే చేస్తారు. అణుడికే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న విదంగా పిల్లలను చిన్నపుడు నుండే అన్నే మంచో పనులను నేర్పించాలని అంటున్నారు..