మాములుగా రాజకీయ నాయకులు నిత్యం బిజీగా ఉంటారు.  పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఉన్నంతకాలం ఏదో ఒక పనిలో తప్పనిసరిగా బిజీగా ఉంటారు.  అలా లేకుంటే మాత్రం వాళ్ళు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.  విజయం సాధించాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు పనిచేసి తీరాల్సిందే.  ఎంత బిజీగా ఉన్నా సరే అది చేయకతప్పదు.  


లేదంటే మాత్రం ఇబ్బందులు పడతారు.  అతడు సినిమాలో చెప్పినట్టుగా పదవిలో లోనై పొలిటీషియన్ అంటే మీడియాకు లోకువ.  కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంటె జనాలు కూడా మర్చిపోతారు.  ఈ డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. అందుకే పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి రాజకీయనాయకుడు కూడా ఎదో విధంగా మీడియాలో కనిపించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు.  ఇప్పుడు ఈ మాజీ మంత్రి, టిడిపి నాయకుడు అయ్యన్నపాత్రుడు కూడా అలానే చేశారు.  చేయడమే కాదు, అందర్నీ మెప్పించే ప్రయత్నం కూడా చేశారు.  


అదెలా అంటే, మాజీమంత్రి తన కొడుకు పెళ్లి సందర్భంగా తనను తాను మర్చిపోయాడు.  ఎప్పుడు రాజకీయాల్లో సీరియస్ గా కనిపించే ఈ మాజీమంత్రిగారు సినిమా పాటలకు తెలియకుండానే స్టేజీమీదకు వెళ్లి స్టెప్స్ వేశాడు.  అవి ఏవో పాటలు అనుకుంటే పొరపాటే, అప్పట్లో దేవత సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన వెల్లువెత్తి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మా... అనే సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్స్ వేశాడు.  


పాపం మాజీ మంత్రిగారికి డ్యాన్స్ రాదు.  కానీ, చుట్టూ ఉన్న వ్యక్తులు వేస్తున్న స్టెప్స్ ను చూసి ఫాలో అయ్యాడు.  ఇప్పుడు ఫాలోయింగ్ పెంచుకోవడమే తప్పా, ఫాలో చేసింది లేదు కదా, కానీ ఈసారి తప్పలేదు.  ఆ ఒక్క సాంగ్ కే కాదు, రవితేజ సినిమా రాజాధి గ్రేట్ సినిమాలోని గున్నాగున్నా మామిడి అనే పాటకు కూడా అదిరిపోయే విధంగా డ్యాన్స్ చేశారు.  ఈ స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.  ఎంతైనా రాజకీయ నాయకుడు కదా.  వాళ్ళ సోషల్ మీడియా మాజీ మంత్రిగారి స్టెప్పులను హైలైట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: