డబ్బున్న వాళ్లలో ఆడంబంరం పెరిగింది. వందల కోట్లు కూడ బెట్టుకున్నావాళ్లు... తమ ఇళ్లలో వివాహాది శుభకార్యాలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంలో జయలలిత తన పెంపుడు కొడుకు పెళ్లి గురించి చేసిన ఖర్చు గురించి అప్పట్లో చాలా ఏళ్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఓబుళాపురం గనుల ఫేమ్ గాలి జనార్దనరెడ్డి కూతురు బ్రాహ్మణి పెళ్లి ఖర్చు కూడా అదిరిపోయింది.. ఆ పెళ్లికి కనీసం 500 కోట్లు ఖర్చయ్యాయని అనుకున్నారు.

 

ఇప్పుడు ఈ రెండింటినీ బ్రేక్ చేస్తూ మరో వివాహం సౌత్ ఇండియాలో జరగబోతోంది. ఇంతకీ ఇంత ఘనంగా జరుగుతుందంటే ఎవరి ఇంట్లో పెళ్లి తెలుసా... గాలి జనార్థన రెడ్డి శిష్యుడు శ్రీరాములు ఇంట పెళ్లి.. ఆయన ఇప్పుడు కర్ణాటకలో మంత్రి కదా. ఆయన కూతురు పెళ్లి ఘనంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి సౌత్ ఇండియాలోనే ఓ సెన్సేషన్ గా మారుతోంది.

 

ఈ పెళ్లికి కనీసం 600 కోట్లు ఖర్చవుతుందని అనుకుంటున్నారు. ఇంతకీ... పెళ్లికొడుకు ఎవరో తెలుసా.. మన తెలుగబ్బాయే... అమ్మాయి కర్నాటక ఆరోగ్యమంత్రి శ్రీరాములు కూతురు. అబ్బాయిది హైదరాబాద్. పారిశ్రామికవేత్తల కుటుంబం.. లాస్ట్ డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 5 న పెళ్లి.. ఆ రోజే బళ్లారిలో వివాహ విందు. బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్‌లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 40 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ పెళ్లికి లక్ష మంది సెలబ్రెటీలను పిలుస్తున్నారట.

 

పెళ్లి సెట్స్ డిజైనింగ్, ఏర్పాటుకే 300 మంది పనిచేస్తున్నారు. నటి దీపికా పడుకొనే పెళ్లికి పనిచేసిన మేకప్ ఆర్టిస్టులనే ఈ పెళ్లి మేకప్పులకూ బుక్ చేశారట. ముఖేష్ అంబానీ కూతురు ఇష్టా పెళ్లి కి పని చేసిన టీమ్ తో వీడియో తీయిస్తున్నారట. ఇప్పటికే బెంగుళూరులోని అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లనూ బుక్ చేసేశారు. మంత్రిగారి కూతురు పెళ్లా మజాకా..

మరింత సమాచారం తెలుసుకోండి: