లేడీస్ హాస్టల్ లో దారుణం చవి చూసింది...ఎవరికి తెలియ కుండా ఓ యువత బాత్రూం లో బిడ్డనుకని కని కిటికీలోంచి బయట పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. బాత్రూం లోంచి వింత శబ్దాలు రావడంతో అక్కడికి వెళ్లి చూడగానే కళ్ళు కూడా తెరవరని పసికందు రక్తం మడుగులో కనిపించరు.. షాక్ కు గురైన బాలికలు విషయాన్ని వార్డెన్ కు చెప్పారు.. వార్డెన్ సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. 

 

 

 

ఈ ఘటన ధులే జిల్లా సక్రీలోని సావిత్రీబాయి ఫులే ఆదివాసి హాస్టల్ లో సుమారు 70 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వాళ్లలో ఐదో తరగతి నుంచి డిగ్రీ చదివేవాళ్లదాకా ఉన్నారు. 18 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థిని తాను గర్భం ధరించిన విషయాన్ని రహస్యంగా దాచింది. చిన్నవయసు కావడం, సరైన ఆహారంలేక బలహీనంగా ఉండటంతో ఆమె పరిస్థితిని ఎవరూ అంచనా వేయలేకపోయారు. తీరా గత నెల 29న ఆమెకు పురిటినొప్పులొచ్చాయి..

 

 


స్నేహితులకు కూడా చెప్పకుండా బాత్రూంలోకి పరుగులు తీసిన ఆ అమ్మాయి.. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఏం చెయ్యాలో అర్థంకాక.. బిడ్డను బకెట్ లో వదిలేసి వెళ్లిపోయింది. కొన్ని గంటల తర్వాత మిగతా విద్యార్థులు.. బాత్రూమ్ లో నెత్తుటితో నిండిన బకెట్ లో శిశువును చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...

 

 

 

అయితే బిడ్డను కనేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయిన ఆ అమ్మాయి ఎవరా అని వైద్య పరీక్షలు నిర్వహించి తెలుసుకున్నారు . అయితే ఆమె వయసు 18 అంతేకాక సన్న గా ఉండడంతో ఎవరు ఆమెను కనిపెట్టలేక పోయారు .ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు.. బెదిరించి చేశారా లేక ఇష్టపడి వెళ్లిందా అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు...ఈవిషయంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: