కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. స్కూల్ కి వెళ్ళే లోకం పిల్లలను, కాలేజి కి వెళ్ళే యువతులను టార్గెట్ చేస్తూ.. కామాంధులు వారి వారి కోరికలను తీర్చుకుంటున్నారు. వారిని భయపెట్టి, బ్లాక్ మెల్ చేస్తూ వారికి నరకాన్ని చూపిస్తూ.. వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో రెండు దారుణాలు ఒకే రోజు బయటపడ్డాయి. 

 

 

గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. డిగ్రీ విద్యార్థిని పై ఓ రైల్వేగార్డు అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాడేపల్లికి చెందిన అనిల్‌ కుమార్ రైల్వేగార్డుగా పనిచేస్తూ భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతడి ఇంటి ఎదురుగా ఉండే ఓ యువతి విజయవాడలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమెపై కన్నేసిన అనిల్ ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు.

 

 

ఓ రోజు విద్యార్థిని తన ఇంటి మీదుగా నడుచుకుంటూ వెళ్తుండటాన్ని గమనించిన అనిల్ ఆమెను పిలిచి... నీ ఫోటోలు నా ఫోన్ లో ఉన్నాయి’ అని చెప్పడంతో కంగుతింది. వాటిని చూపించాలని ఆమె కోరగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని సెల్‌ ఫోన్లో వీడియో తీసి ఆమెను బెదిరించి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నాడు.

 

 

శనివారం విజయవాడకు వెళ్లిన అనిల్ ఆ యువతిని కాలేజీ నుంచి బయటకు తీసుకెళ్లాడు. తన దగ్గర వీడియోలు బయట పెడతానని బెదిరించి ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి మరో సారి అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త బాగోతాన్ని తెలుసుకున్న అనిల్ భార్య వెంటనే దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు హోటల్‌ కు వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనిల్ వీడియోలు చూపిస్తూ అనేక సార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: