ఎన్ని చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.. దేశంలో ఏదోక మూల అమ్మాయిలను హింసిస్తూ రేప్ చేసి మరీ దారుణంగా చేస్తున్నారు.. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే..బర్కాస్ పరిధిలోని సలాలకు చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. ఆమె చెల్లెలు కూడా భర్త నుంచి విడాకులు తీసుకుని అక్కతోనే కలసి ఉంటోంది. ఈ క్రమంలో ఇంటిని విక్రయించేందుకు అక్కాచెల్లెళ్లు సాబేర్ అనే బ్రోకర్ని కలిశారు. ఇంటి విషయమై చర్చించేందుకు వెళ్లిన అక్కాచెల్లెళ్లకు అక్కడ ఊహించని అనుభవం ఎదురైంది.
ఇంటిని విక్రయించాలని వచ్చిన అక్కా చెల్లెళ్లకు బహ్రెయిన్కి చెందిన ఇబ్రహీం షక్రల్లా మహ్మద్ బైరామి అనే అరబ్ షేక్కి పరిచయం చేశాడు సాబెర్.అమ్మాయిని అరబ్ షేక్లకు అమ్మేసిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. అరబ్ దేశానికి చెందిన 60 ఏళ్ల ముసలోడికి 25 ఏళ్ల వివాహితను విక్రయించాడో బ్రోకర్. యువతిని తాను కొనుక్కున్నానంటూ ఆ విదేశీ షేక్.. ఆమెను బంధించి మూడు రోజులుగా అత్యాచారం చేయడమే కాకుండా శరీరంపై సిగరెట్లతో కాల్చిన అమానుష ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన నగరంలోని బర్కాస్ ప్రాంతంలో జరిగింది.
ఇద్దరు ఉండటానికి ఇల్లు కావాలని వెళ్ళిన యువతిని మోసం చేసిన బ్రోకర్ ఆమెను వేరే ఎవరికో అమ్మేశాడు..అతడు దుబాయ్ షేక్.. అలా ఆమెను మూడు రోజుల పాటు బయటకు రానివ్వకుండా ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.. అయితే అతను చేసిన దారుణాన్ని అక్క కనిపెట్టింది.. అత్యాచారం చేయడమే కాకుండా సిగరెట్లు కలుస్తూ తన పైశాచిక బుద్దిని బయట పెట్టాడు.. విషయం తెలుసుకున్న అక్క ఆమెను వెతికింది..
అక్కాచెల్లెళ్లు పోలీసులను ఆశ్రయించారు.అత్యాచారం.. గదిలో బంధించి హింసించారంటూ బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు బహ్రెయిన్కి చెందిన ఇబ్రహీంని అరెస్టు చేశారు. అతనికి హైదరాబాద్లో షెల్టర్ కల్పించిన సలాం బిన్ సయ్యద్ను అదుపులోకి తీసుకున్నారు. మహిళను ఇబ్రహీంకి విక్రయించిన సాబెర్, సమీన దంపుతులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరబ్ షేక్లతో దొంగపెళ్లిళ్ల వ్యవహారంగా అనుమానిస్తున్నారు...ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి...