కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే కరోనాను మించిన వైరస్ ఒకటి ఆంధ్రాను వణికించిందట. అయితే ఈ కరోనాకు శాస్త్రవేత్తలు ఇంకా మందు కనుక్కోలేదు. కానీ ఆంధ్రాను వణికించిన ఈ కొత్త వైరస్ కు మాత్రం జనమే మందు కనిపెట్టేశారట.

 

 

అదేంటి కరోనాను మించిన వైరస్ ఏంటబ్బా అనుకుంటున్నారా.. అదో రాజకీయ వైరస్ లెండి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చంద్రబాబు అండ్ కో పై రోజూ ఏదో ఒక పోస్టు పెడుతూ నే ఉంటారు కదా.. తాజాగా ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబు ను నారా వైరస్ అంటూ విమర్శలు చేశారు.

 

 

ఆయన తన ట్విట్ లో ఏమన్నారంటే.. " నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్ తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా పడుతోంది.” అంటూ ఘాటుగా కామెంట్ చేశారు.

 

 

మరో పోస్టులో.. “ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తామసలు ఎన్నికల్లోనే పోటీ చేయమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నాడు. ఇది చంద్రబాబు చెప్పించిందే. కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి. ఏమాట ఎవరితో అనిపించాలనే స్కెచ్ వేయడంలో బాబును మించినోళ్లేవరూ లేరు...అని పెట్టారు విజయసాయి రెడ్డి.

 

 

విజయ సాయి రెడ్డి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో ఇలా పొలిటికల్ పోస్టులు పెడుతుంటారు. ఆయన పోస్టులు కొన్ని సార్లు మహా ఘాటుగా ఉంటాయి. తాజాగా పెట్టిన ఈ పోస్టు కూడా బాగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ తో చంద్రబాబు ను పోల్చడం కాస్త విడ్డూరంగా ఉన్నా.. విజయ సాయి రెడ్డి తన పొలిటికల్ పోస్టులకూ కరోనాను వాడుకోవడం కాస్త వెరైటీయే.

మరింత సమాచారం తెలుసుకోండి: