కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న వ్యాధి. ఇప్పటికే ఈ వ్యాధితో కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని లక్షల మందికి ఈ వ్యాధి సోకి బాధపడుతున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి 124 దేశాలకు వ్యాపించింది.
తాజాగా బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రికి ఇప్పటికే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్కు కోవిడ్ పాజిటివ్గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఓ కార్యక్రమంలో ట్రుడో దంపతులు పాల్గొనన్నారు. అనంతరం సోఫీ గ్రెగోర్లో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ ఉన్నట్టు తేలిందని ఏఎఫ్పీ వార్తాసంస్థ పేర్కొంది.
భార్య కరోనా బారినపడటంతో కెనడా ప్రధాని ట్రుడో తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల సలహాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రూడో కమ్యూనికేషన్ డైరెక్టర్ కామెరూన్ అహ్మద్ వెల్లడించారు. లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు.
ట్రుడోకు కరోనా లక్షణాలు లేవని నిర్ధారించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కెనడా ప్రభుత్వం అప్రమత్తమైంది. న్యూయార్క్లోని యూఎస్ ప్రధాన కార్యాలయంలో నమోదైన తొలి కేసు ఇదే. మహిళా రాయబారికి కరోనా వైరస్ సోకినట్టు ఈ మేరకు ఐరాస ఓ నోట్ ప్రచురించింది.
అమెరికా అధ్యక్షుడితో కలిసి విందులో పాల్గొని ఫొటోలు దిగిన బ్రెజిల్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు వార్త వస్తున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ప్రెస్ సెక్రటరీ ఫాబియో వాజ్న్గార్టెన్ గత వీకెండ్లో ఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్లో ఆయనతో కలిసి విందులో పాల్గొన్నారు. ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సేను కలిసి ఫొటో దిగిన ఫాబియో.. దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు.