కొన్నిసార్లు మరణం ఎలా సంభవిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ మధ్య కాలంలో ఎవరూ ఊహించని విధంగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎవరూ ఊహించని ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెలంగాణలో ఒక మహిళ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
 
తెలంగాణలోని మహబూబాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తాళిబొట్టు మహిళ ప్రాణాలను తీసింది. తాళిబొట్టు మహిళ ప్రాణాలను తీయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా...? వినిడానికి ఆశ్చర్యంగానే ఉన్న ఒక మహిళకు తాళిబొట్టే మృత్యుపాశమైంది. తాళి గొంతుకు బిగుసుకుపోవడంతో క్షణాల్లో మహిళ తనువు చాలించింది. అనుకోకుకుండా జరిగిన ఈ ఘటనతో షాక్ అవ్వడం మహిళ కుటుంబ సభ్యుల వంతయింది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే బొడ్లాడ మండలం దంతాలపల్లికి చెందిన ఎల్లమ్మ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో ఆయాగా విధులు నిర్వహిస్తోంది. ఎల్లమ్మ ఇంటి తాళం చెవిని తాళిబొట్టుకు కట్టుకొని దాని సహాయంతో తాళం వేయడం తీయడం చేసేది. రోజూలాగానే తాళిబొట్టుకు కట్టిన తాళం చెవి సహాయంతో ముందుకు వంగి తాళం తీయడానికి ప్రయత్నించింది. అదే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడిన ఎల్లమ్మ తాళం చెవి తాళంలో ఇరుక్కుపోవడంతో చనిపోయింది. 
 
తాళిబొట్టు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడాక మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి షాక్ అవ్వడంతో పాటు కన్నీరుమున్నీరవుతున్నారు. మహిళ ప్రమాదవశాత్తూ మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. భర్త కట్టిన తాళిబొట్టే ఉరితాడై మహిళ ప్రాణాలు తీసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఎల్లమ్మ నిజంగా ప్రమాదవశాత్తూ చనిపోయిందా..? ఎవరైనా ప్లాన్ చేసి చంపేశారా...? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.           
   
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: