దేశంలో శర వేగంగా విస్తరిస్తున్న ఈ కరోనా మహమ్మారి చివరకూ రాష్ట్రపతి భవన్ వరకూ వెళ్లిందా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడ కోవిడ్ 19 వైరస్ సోకిందా.. అంటే అలా జరిగే అవకాశాలు లేకపోలేదంటున్నాయి తాజా వార్తలు.. తాజాగా ఓ పత్రిక రాసిన కథనం ప్రకారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూ కరోనా సోకే అవకాశం ఉందంటోంది. ఎందుకంటే..?

 

 

ఇటీవల దేశంలోనే కరోనా కలకలం రేపిన బాలీవుడ్ గాయని కనికా కపూర్ సంగతి తెలిసిందే కదా. కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత ఆమె వల్ల ఎవరెవరికి ఇబ్బంది వచ్చి ఉండవచ్చన్నదానిపై అధికారులు లెక్కలు తేలుస్తున్నారు. అయితే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆ జాబితాలోకి వచ్చినట్లు యూపీకి చెందిన అధికారులు చెబుతున్నారు.

 

 

బాలీవుడ్ గాయని కనికా కపూర్ లండన్ నుంచి ముంబై వచ్చినప్పుడు డాక్టర్లు ఆమెకు క్వారంటైన్ లో ఉండాలని చెప్పారు. కానీ ఆమె ఆ సలహా బేఖాతరు చేసింది. లైట్ గా తీసుకుంది. పార్టీలకూ విందులకూ వెళ్లింది. నాలుగు రోజులపాటు లక్నో, కాన్పూర్ ప్రాంతాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొంది. అలా లక్నోలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎంపీ దుష్యంత్ సింగ్ , ఆయన తల్లి వసుంధర రాజే కూడా వెళ్లారు.

 

 

ఆ తర్వాత కనికాకు కరోనా అని తేలింది. దీంతో ఈ వీఐపీలంతా షాకయ్యారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న దుష్యంత్ సింగ్ ఆ తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కలిశారట. దీంతో ఇప్పుడు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రపతి కోవింద్ కు కోవిడ్ సోకిందా లేదా అన్న విషయంపై పరిశీలన జరుపుతున్నారు. కరోనా లింకులు ఎలా వ్యాపిస్తాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: