కరోనాపై జరుగుతోన్న పోరులో ప్రపంచమే ఆగిపోయింది. ఇప్పటి వరకు అప్పుడెప్పుడో వచ్చిన మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలు సైతం కరోనాకు బ్రేకులు వేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా కరోనా ప్రపంచమే కాదు అన్ని దేశాలు.. అన్ని గ్రామాలు.. చివరకు మారుమూల ప్రాంతాలకు సైతం బ్రేక్ వేసింది. ఇక ఇప్పటికే మోదీ ప్రభుత్వం ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ ప్రకటించాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేదు. దీంతో మందుబాబులు ఓ రేంజ్లో పండగ చేసుకుంటున్నారు.
భారీగా ఇళ్లలో మద్యం నిల్వలను ఏర్పాటు చేసుకొని మందు, విందులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం నగరాలు... పట్టణాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనిని అవకాశంగా చేసుకుని మందు అమ్మే వాళ్లు రేట్లను డబుల్.. ట్రిబుల్ చేసేస్తున్నారు. మామూలు మద్యాన్నే ఒక్కో బాటిల్ ను డబుల్ ధరకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారట. స్కాచ్ బాటిల్స్ అయితే వేలు పలుకుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూన్ వరకు లాక్డౌన్ తప్పకపోవచ్చని అంటున్నారు.
ఈ క్రమంలోనే అస్సలు మందు లేకపోతే రోజు గడవని వారంతా ఇప్పుడు బ్లాక్లో అయినా మద్యం దొరికితే చాలని బ్లాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. మద్యానికి బానిస అయిన వారు ఎంత ధర అయినా పెట్టి కొంటున్నారు. మరి కొందరు కల్తీ మద్యం తాగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. ఇక సిగరెట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. కిరాణా షాపుల్లో సిగరెట్లు అమ్మకపోవడంతో ధూమపాన ప్రియుల కష్టాలు కూడా మామూలుగా లేవు. దీంతో సిగరెట్ల రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple