ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం క్రియేట్ చేస్తోంది. 7, 84, 381 కేసులతో ఇక మరణాల సంఖ్య 38 వేలకు చేరువ అవుతోంది. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు స్పెయిన్, ఇటలీ, జర్మనీ లాంటి దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం క్రియేట్ చేస్తోంది. ఇక మనదేశంలో చూస్తే ఇప్పటి వరకు 1251 కేసులు ఉన్నాయి. సోమవారం ఒక్క రోజే ఏకంగా 227 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఆరుగురిని బలితీసుకుంది. మొత్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 76కు చేరాయి.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. అందులో తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, అపోలో, గ్లోబల్ ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 84 , 381
మృతుల సంఖ్య - 37, 780
రికవరీ కేసుల సంఖ్య - 1,65, 035
యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 81, 566
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2,02,218
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1251
కొత్త కేసులు - 227 +
మృతులు - 32
తెలంగాణలో కేసులు - 76
తెలంగాణ మృతులు - 6
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 23
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple