చాలా మంది వలస కూలీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. వాళ్ళను కనీసం పట్టించుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే వారి బాధల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ కొందరు కన్నీళ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో వలస కూలీల సంఖ్య దాదాపుగా నాలుగు కోట్ల వరకు ఉంది. వీళ్ళు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళే. వీరు నగర ప్రాంతాల్లో పనులు చేయడానికి వచ్చారు. ఉత్తర భారత దేశం నుంచి దక్షిణ భారత దేశానికి ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఉన్నారు.
వారు అందరూ కూడా ఇప్పుడు తమ గ్రామాలకు తిరిగి వెళ్ళిపోతున్నారు, నడిచి వెళ్ళే వాళ్ళు కొందరు ఉన్నారు. ఆకలితో ఇబ్బంది పడలేక ఆత్మహత్యలు చేసుకోలేక పిల్లల మొహం చూసి చాలా మంది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. అయితే లాక్ డౌన్ విషయంలో వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. రెండు రోజులు సమయం ఇచ్చి వాళ్ళను సొంత గ్రామాలకు వెళ్ళనిచ్చి అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే వారికీ కష్టాలు తప్పేవి అంటున్నారు.
నిజంగా కొందరు ఇచ్చిన సలహా ప్రకారం అలా చేసి ఉంటే మహారాష్ట్రలో వలస కూలీలు ఎక్కువ, తెలంగాణాలో వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు గనుక ఇష్టం వచ్చినట్టు చేసి వెళ్ళిపోయి ఉంటే మాత్రం పరిస్థితులు ఊహకు కూడా అందేవి కాదు అంటున్నారు. చాలా దారుణంగా ఉండేవి సమయం ఇచ్చి ఉంటే అంటున్నారు. దక్షిణ భారత దేశంలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ వలన నష్టం ఎక్కువగా ఉండి ఉండవచ్చు అంటున్నారు. ఇప్పుడు గ్రామ స్థాయిలో కరోనా లేదు. అప్పుడు వచ్చి ఉండేది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNappl