అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ట్రంప్ సాధారణంగా వ్యాపార దిగ్గజం. దాదాపు అభివృద్ధి చెందిన దేశాలు అన్నింటి లోను ఆయనకు పెట్టుబడులు భారీగా ఉన్నాయి. అమెరికా ఇప్పుడు ఆర్ధిక శక్తి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఇదే విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ట్రంప్ మాట అందరూ వినాలి గాని ఆయన మాట ఎవరూ వినే పరిస్థితి ఆ దేశంలో ఉండదు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అనవసర విషయాలు అన్నీ కూడా ఆయనకే కావాలి. 

 

 

అందుకే ఇప్పుడు అమెరికా భారీగా నష్టపోతుంది అనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ట్రంప్ అమెరికాను నాశనం చేసారు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. అక్కడి మెట్రో రైళ్ళలో జనం ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. దాదాపు 60 లక్షల మంది ప్రజలు నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అక్కడ వ్యాపార వేత్తలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ప్రతీ రోజు అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటారు. అయినా సరే ట్రంప్ మాత్రం విమానాలను రద్దు చేయడం లేదు. మేయర్లు గవర్నర్లు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా సరే ట్రంప్ మారడం లేదు. 

 

 

ఆ దేశంలో కరోనా పెరగడానికి ట్రంప్ చాదస్తమే కారణం. ఆయన ఏది అనుకుంటే అది జరగాలి గాని అమెరికా ఏది అనుకుంటే అది జరగడానికి ట్రంప్ ఒప్పుకునే పరిస్థితి ఉండదు, ట్రంప్ చేతిలో అమెరికా పిచ్చోడి చేతిలో రాయి రెండు ఒక్కటే అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. అమెరికా ఇప్పుడు ఆర్ధికంగా నష్టపోతుంది. ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇప్పుడు గనుక ట్రంప్ చాదస్తం వదిలి వాస్తవ రూపానికి రాకపోతే మాత్రం అమెరికాలో జరిగే నష్టం అంచనా వేయడం కూడా ఎవరికి సాధ్యం కాదు అనేది ప్రపంచం చెప్పే వాస్తవం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: