గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన అధినేత పవన్ సోదరుడు, నటుడు నాగబాబుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. వీరు వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు విషయంలో పవన్ స్పందిస్తూ... కరోనా సమయంలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయవద్దని అనుకున్నామని, అయితే, ఆ పరిస్థితిని వైసీపీనే కల్పించిందంటూ మండిపడ్డారు.

 

దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి అసలు రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండ్ ఉంటేగా? అంటూ పవన్ కళ్యాణ్‌ను ఎద్దేవా చేశారు. అయితే విజయసాయి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మీద ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే నాగబాబు ఎప్పుడు విజయసాయి చేసే విమర్శలపై పెద్దగా స్పందించిన సందర్భాలు తక్కువ. కాకపోతే ఇప్పుడు లాక్ డౌన్ వల్ల ఖాళీగా ఉన్నారనుకుంటా, అందుకే విజయసాయి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.

 

ఇప్పడు నిద్రలేచి, పవన్ తో పొత్తు పెట్టుకోవడానికి తన దగ్గరకు విజయసాయి వచ్చారని మాట్లాడారు. ఇక దీనికి విజయసాయి కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. పావలా బ్యాచికి రోషం ఎక్కువే అని, తమ నాయకుడు ఎప్పడు పొత్తులుండవని స్పష్టంగా చెప్పారని , చిరంజీవి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవని పవన్, నాగబాబులని ఉద్దేశించి గట్టి కౌంటర్ ఇచ్చారు.

 

అయితే ఈ వార్ లో విజయసాయి, చిరంజీవిని మధ్యలోకి లాగారు. కాకపోతే ఆయన్ని గౌరవంగా సంబోధించడం బట్టి చూస్తుంటే, చిరంజీవి తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని అడ్డం పెట్టుకుని మరీ పవన్, నాగబాబులకు చురకలు అంటించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పలుసార్లు చిరంజీవి, జగన్ కు మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే.

 

ఇక విజయసాయి అంత మాటలు అన్నాక నాగబాబు ఊరుకుంటారా, మళ్ళీ నిద్రలేచి, నీలాంటి గొట్టంగాళ్ళు తనతో వాదించే బదులు ,ఫ్యూచర్ లో జైల్లో ఏలా టైం పాస్ చెయ్యాలి అని ఒక డే టు డే షెడ్యూల్ వేసుకుంటే, టైం కలిసి వస్తుందని కౌంటర్ ఇచ్చారు. మరి చూడాలి వీళ్ళ వార్ ఎంతవరకు వెళుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: