ప్రపంచ దేశాలకి పెద్ద అన్న చెప్పుకొనే అమెరికా దేశం లో ఇప్పుడు అక్కడ ఒక రకంగా మారణ హోమమే సాగుతుంది అనుకోవచ్చు. ఇక అమెరికా దేశ ఆర్ధిక రాజధాని అయిన న్యూయార్క్ నగరంలో  పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే… అక్కడ మరణాల సంఖ్య మాత్రం అసలు ఆగడం లేదు. రోజురోజుకి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వాటిహో పాటు మరణాలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4000 మంది చనిపోతే ఒక అమెరికాలో మాత్రం 1000 కి పైగా చనిపోతున్నారు. అందులో కూడా 600 మంది ఒక్క న్యూయార్క్ లోనే చనిపోతున్నారు.

 


ఒక్క న్యూయార్క్ లోనే కేసులు ఏకంగా రెండు లక్షల దిశగా పయనిస్తున్నాయి. అమెరికా దేశం మొత్తం ఏ స్థాయిలో పరిస్థితి ఉందన్నది పక్కన పెడితే న్యూయార్క్ నగరం మాత్రం అత్యంత భయంకరంగా ఉంది. అయితే ఇప్పుడు భూతల స్వర్గంగా న్యూయార్క్ ని పేర్కుంటూ ఉన్నారు. అలాంటి న్యూయార్క్ లో నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే శవాలే కనపడుతున్నాయి. ఇంకా అక్కడ న్యూయార్క్ రాష్ట్రానికి దగ్గరగా ఉండే న్యూజెర్సీ లో కూడా కేసులు దాదాపు 60 వేల వరకు చేరుకున్నాయి.

 

 

ఇక అత్యంత దారుణ పరిస్థితి ఏమంటే న్యూయార్క్ రాష్ట్రంలో శవాలను దహనం చేయడానికి కూడా ఎవరూ ముందుకి రావడం లేదు అంటే పరిస్థిని అంచనా వేయండి. ఇక అక్కడ వైద్యులు కూడా వైద్యం చేయడానికి భయపడుతున్నారు, చాలా వరకు కూడా ముందుకి వైద్యులు రావడం లేదు. అయితే ప్రస్తుతం ట్రంప్ సర్కార్ కి న్యూయార్క్ లో కేసులను కట్టడి చేయడం పెద్ద సవాల్ గానే మారింది. నిజానికి సంబంధిత రాష్ట్రాలలో భారీగా వైద్య సిబ్బంది ఉన్నా సరే అక్కడి కేసులను మాత్రం కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు. ఇప్పుడు న్యూయార్క్ ని చూసి ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచం మొత్తం భయపడుతుంది. ఏది ఏమైనా ఈ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: