గత కొన్ని రోజులుగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి ఏదొకరకంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తుంటే, మరోవైపు టీడీపీ నేతలు విమర్శలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక దేవినేని ఉమా అయితే ఓడిపోయిన దగ్గర నుంచి పెద్దగా పని లేనట్లుంది. దాంతో రోజు మీడియా ముందుకు రావడం జగన్ పై విమర్శలు చేయడం చేస్తున్నారు.

 

తాజాగా కూడా జగన్, మంత్రి  కొడాలి నాని టార్గెట్ గా విమర్శలు చేశారు. తన నోటికొచ్చిన విధంగా అబద్దాలు చెప్పుకుంటూ పోయారు. ముఖ్యంగా వాలంటీర్లు కరోనా పై సర్వే చేసే పనిలో ఉంటే, వారి ఎందుకు రేషన్ సరఫరా చేయట్లేదంటూ మంత్రి నానినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వెనుకవేసుకొస్తూ, జగన్ ని తీవ్రంగా విమర్శించారు. ఇక రమేష్ కుమార్ వ్యవహారం హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో జగన్ కు మొట్టికాయలు తప్పవని జోస్యం చెప్పారు. పైగా జగన్ సీఎం పదవి కూడా పోతుందన్నట్లు మాట్లాడేశారు.

 

అయితే ఇలా ఉమా రోజూ చేసిన విమర్శలకు మంత్రి నాని ఒకేసారి కౌంటర్ ఇచ్చి, ఉమా పరువు తీసేసారు. కేవలం తీసేసిన తహశీల్దార్ అంటూ ఒకే మాటతో ఉమా గాలి తీసేసారు. అలాగే ఉమా, రాజకీయం కోసం సొంత వదిననే చంపించారని ఆరోపించారు. ఇక నానికి తోడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఉమాని ఒక ఆట ఆడేసుకున్నారు. కరోనా పై ఐకమత్యంగా పోరాడాల్సిన సమయంలో ఉమా ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయం చేస్తున్నారుని, ఉమాకు పిచ్చి పట్టిందని మాట్లాడారు.

 

అయితే ఉమా రోజూ పనిపాటలేకుండా విమర్శలు చేస్తే, నాని ఒక్కసారిగా వచ్చి, ఉమా పరువు మాత్రం గట్టిగా తీసేసారని వైసీపీ కార్యర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉమా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, నోటికి పని చెప్పకుండా ఉంటే బెటర్ అని, లేదంటే నాని ఇంకొకసరి రంగంలోకి దిగితే ఉన్న కాస్త పరువు కూడా పోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: