వృద్ధ్యాప్యంలో అన్యున్యంగా కలిసి ఉంటూ నేటితరం పిల్లలకు ఆదర్శనంగా నిలవాలి. నేటి పిల్లలకు మంచి చెడు చెప్పాల్సిన వారే గొడవలు పడుతున్నారు. వయస్సు పెరిగిన కానీ వారిలో అహం మాత్రం తగ్గటం లేదు. చిన్న విషయాలకే కోపాలతో వారి జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఆర్థిక సమస్యలతో కొందరు, అనుమానాలతో మరి కొందరు, మద్యం మత్తులో మరికొందరు ఇలా రోజుకో ఘటన ఎదో ఒక్క ప్రాంతంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ జిల్లాలో చోటు చేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. నల్లజర్లలో దారుణ చోటు చేసుకుంది. మనస్పర్థలు, ఆర్థిక పరమైన గొడవల కారణంగా ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆవపాడుకు చెందిన పసుపులేటి రంగారావు (60), కళావతి (58) భార్యాభర్తలు. కొన్నాళ్ల పాటు వీరిద్దరూ విజయవాడలో హోల్‌సేల్‌ కిరాణా వ్యాపారం చేశారు. ఆ వ్యాపారంలో వారికీ నష్టాలు రావడంతో నాలుగు నెలల కిందట స్వగ్రామానికి వచ్చారు. సొంత ఊర్లో వారు అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.

 

 

అయితే మృతుడి సోదరుడు తెలిపిన వివరాల మేరకు నాలుగేళ్ల కిందట రంగారావు కుమారుడు దుర్గాప్రసాద్‌‌కు ఓ యువతితో వివాహమైంది. పెళ్లయిన మూడు నెలలకే వారి మధ్య గొడవలు జరుగుతు ఉండేవి. దీంతో ఆ యువతి మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. మంట్లో కాలిపోతున్న ఆమె భర్తను గట్టిగా పట్టుకోవడంతో దుర్గాప్రసాద్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

అయితే మృతుడి సోదరుడు రంగారావు తమ్ముడి ఫిర్యాదు మేరకు సీఐ రవికుమార్‌, ఎస్సై చంద్రశేఖర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని  పరిశీలించారు. బుధవారం రాత్రి మంచంపై పడుకొని ఉన్న కళావతి మెడపై రంగారావు కత్తితో హత్య చేశాడు. ఆపై ఆయన పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: