ఆకలి ఎంతటి పనైనా చేపిస్తుందని అంటారు.  అయితే ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  దాంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్తంభించిపోయాయి.   పేద ప్రజలకు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  ఆహారం కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా కర్ణాటకలోని బరేలీలో ఉచిత ఆహార కిట్‌లను అందించారు. సామాజిక దూరం నిబంధనను విస్మరించి పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా వాటిని తీసుకోవడానికి ప్రజలు ఎగబడ్డారు. ఫుడ్‌ ప్యాకెట్లను విజయనగర్‌ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ ప్రజలకు అందించారు.

 

ఆకలితో అలమటిస్తోన్న ప్రజలు ఒక్కసారిగా వాటి కోసం ఎగబడ్డారు. ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నారని తెలియగానే జనాలు ఎగబడ్డారు.. కొట్టుకున్నారు.  వారిని అదుపు చేయడానికి నానా తిప్పలు పడ్డారు పోలీసులు.  సామాజిక దూరం పాటించకుండా లాక్ డౌన్ ఉల్లంఘించారని.. ఆహార ప్యాకెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

 

ఆహార పొట్లాల కోసం అందరూ ఒక్కసారిగా ఎగబడడంతో కొందరు మహిళలు కిందపడిపోయారు.  కర్ణాటకతో పాటు చాలా రాష్ట్రాలు వలస కార్మికులకు, పేదలకు ఆహారాన్ని అందిస్తున్నాయి.కాగా, మే 3వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: