రంజాన్ మాసం వచ్చేస్తోంది. కానీ మరోవైపు కరోనా భయపెడుతోంది. అందుకే కరోనా సమయంలో రంజాన్ ప్రార్థనలు కూడా ఇళ్లలోనే చేసుకోవాలని ఏపీ సర్కారు ఇప్పటికే ముస్లింలకు సూచించింది. అయితే రంజాన్ మాసం అంటేనే పవిత్ర మాసం. ఈ మాసంలో ముస్లింలు.. పేద ముస్లింలకు దానాలు విరివిగా చేస్తుంటారు. ఈ దానాలు అందుకునేందుకు నిరుపేద ముస్లింలు కూడా భారీగా మసీదుల వద్ద చేరుతుంటారు.

 

 

అయితే కరోనా ఉన్న దృష్ట్యా ముస్లింలు ఇలాంటి దాన కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే ముందుగా తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రంజాన్‌ ఉపవాస దీక్షలలో 5 పూటలా నమాజ్‌ చేయడానికి ఇమామ్‌, మౌజన్‌లకు అనుమతిని ఇస్తున్నామని, నమాజ్‌కు సంబంధించిన అజా సమయంలో సైరన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్‌ పండుగ కరోనా వైరస్‌ సమయంలో వచ్చినందున్న.. ముస్లిం సోదరులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

 

 

కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. పేద ముస్లిం వాళ్లకు దాతలు చేసే ఉచిత అన్నదాన కార్యక్రమం అనుమతితో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇక కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా కోరారు. సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించే సమయంలో ఎవరూ బయటకు రావోద్దని, ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని ఇఫ్తార్‌ జరుపుకోవాలని అంజాద్‌ బాషా సూచించారు.

 

 

నమాజ్‌ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలని అంజాద్‌ బాషా పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల దుకాణాలు ఉదయం 10 వరకు అనుమతి ఇస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ఉపవాస దీక్ష విరమణ సమయంలో పండ్లు, ఫలాల కోసం సాయంత్రం వేళ దుకాణాలకు అనుమతినిచ్చినట్లు అంజాద్‌ బాషా చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: