నిజానికి రోజురోజుకి మానవత్వం అనేది కనపరకుండా పోతుంది ప్రపంచంలో. ఒకపక్క ప్రపంచంలో కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మరో వైపు కొందరు వారి మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తూ ఇబ్బందులను తెచ్చి పెడుతున్నారు. అలాగే కొందరు వారు ఏమి చేస్తున్నారో వారికే అర్థం కాకుండా పనులు చేస్తూ వారి ప్రాణాలతో పాటు, పక్కనోని ప్రాణాలు కూడా బాలి అయిపోతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే...  

 


ఢిల్లీలో ఒక మహిళ తన అత్తమామలను కడతేర్చింది. అయితే ఎంత దారుణం అంటే భర్త ఇంట్లో ఉండగానే, భార్య తన అత్తమామలను హత్య చేసింది. కాకపోతే ఈ జంట హత్యలు జరుగుతున్న సమయానికి నిందితురాలు కవిత, ఆవిడ భర్త, తన ఇద్దరు పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఇంతమంది ఉన్నా,  ఆమె అత్తమామలను ఎలా హత్య చేసిన విధానం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఇక ఈ హత్యలో భర్త కూడా పాత్ర పోషించాడేమో అని పోలీసులు వారిని అనుమానిస్తున్నారు. 

 


ఈసంఘటన విషయంలో నేడు ఉదయం 11 గంటలకు ఢిల్లీ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అయితే.. ఎవరో తమ ప్రాంతంలో హత్య జరిగిందంటూ పోలీసులకు సమాచారం అందించడంతో  దానితో వారు రంగంలోకి దిగారు. అయితే ఇక్కడ కవిత తన అత్తమామలు అయిన రాజాసింగ్ (61), ఓంవతి (58) లను కట్టేసి ఉంది. ఇక ఆ తర్వాత వారిని బెడ్ రూమ్‌ లోకి తీసుక వెళ్లి హత్య చేసింది ఆవిడ. 

 


అయితే అక్కడ వారి ముఖం మీద కత్తి గాట్లు ఉండడం పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు కారణం ఆస్తికి సంబంధించి కొంతకాలంగా వివాదం వారి మధ్య జరుగుతోందని, దీనికారణం చేత మరోసారి వారి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్త పరుస్తున్నారు. అయితే... భర్త తల్లిదండ్రులను భార్య కట్టేసి చంపుతుంటే, ఆ సమయంలో భర్త ఏం చేస్తున్నాడు...? అలాగే పిల్లలకు కూడా ఏం తెలియకుండా ఎలా ఉంది...? ఈ విషయంలో భర్తకు పాత్ర ఉందా...? అని పోలీసులు వివిధ కోణాలలో విచారణ చేపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: