కేరళలో గత కొద్దీ రోజుల నుండి కరోనా కేసుల తోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా ఈరోజు కూడా ఒకరు కరోనా వల్ల మృతి చెందారు దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8కి చేరింది.  ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అందులో 33విదేశాల నుంచి వచ్చినవారివి కాగా 23ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారివి మిగితా 7 కాంటాక్ట్ కేసులు.. ఈకొత్త కేసుల తోకలిపి కేరళలో మొత్తం కేసులసంఖ్య 1150 కి చేరగా అందులో 565 మంది బాధితులు కోలుకున్నారు ప్రస్తుతం 577కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 
ఇక ఈరోజు కేరళ తోపాటు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. తమిళ నాడు లో ఈరోజు రికార్డు స్థాయిలో 874 కేసులు నమోదు కాగా కర్ణాటక లో 248 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో  తెలంగాణలో ఈరోజు కొత్తగా 169 కేసులు నమోదవు కాగా 4మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2425కు చేరగా మరణాల సంఖ్య 71కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 33కేసులు నమోదు కాగామొత్తం కేసుల సంఖ్య  2874కు చేరింది. 60 మంది కరోనా వల్ల మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: