ప్రస్తుతం కరోనా కష్టకాలంలో చాలా మంది డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆలా ఆలోచించేవారి కోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి కూడా అదిరిపోయే రాబడి పొందొచ్చునన్నారు. అయితే అంత రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు మాత్రమే మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అని అంటున్నారు నిపుణులు. లేదంటే బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటి వాటిల్లో డబ్బులు డిపాజిట్ చేసుకోవడం మంచిది అంటున్నారు.

 

 

దేశంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 24 నుంచి లాక్ డౌన్‌ విధించింది. దీంతో స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 25,638 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. నిఫ్టీ కూడా 7511 పాయింట్లకు పడిపోయింది. అయితే ఇక్కడి నుంచి మార్కెట్ మళ్లీ 30 శాతం ర్యాలీ చేసిందన్నారు. ఇదే సమయంలో కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టాయన్నారు.

 

 

ఈఐడీ ప్యారీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఐఎఫ్‌సీఐ, కేఆర్‌బీఎల్, అరబిందో ఫార్మా, హెచ్‌ఈజీ, రిలయన్స్ పవర్, వొడాఫోన్ ఐడియా వంటి షేర్లు ఇన్వెస్టర్ల మనీని డబుల్ చేశాయని తెలిపారు. అయితే ఇవే స్టాక్స్ రానున్న రోజుల్లో ఎలాంటి పనితీరు కనబరుస్తాయనేది ఇప్పుడు అందరికి ప్రశ్నగా మారింది. అయితే దీనికి సమాధానం మాత్రం మీరే వెత్తుకోవాలి. కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఈ షేర్లలో డబ్బులు పెట్టి ఉంటే.. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? లేదంటే ఇంకొన్ని రోజుల అలాగే ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలా? అనే అంశం గురించి కూడా బాగా ఆలోచించుకోవాలన్నారు.

 

 

ఏదేమైనా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎవరో చెప్పారనో, లేదంటే స్టాక్ తక్కువ ధరకు వస్తుందనో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం పెట్టిన డబ్బులు పోగొట్టుకోవలసి వస్తుందన్నారు. అందువల్ల మీ సొంత నిర్ణయంతో మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని ప్రారంభించండని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: