టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పార్టీ బలాన్ని ఎక్కువగా ఊహించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వచ్చందంగా టీడీపీ కార్యకర్తలు చాలా మంది పార్టీకి అన్ని విధాలుగా పని చేస్తూ ఉంటారు. అక్కడి వరకు బాగానే ఉన్నా సరే కొందరు మాత్రం సోషల్ మీడియాలో అతి చేస్తూ ఉంటారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా వాళ్లు చేసిన అతి హంగామా కూడా ఆ పార్టీ ఓటమికి గల కారణాల్లో ఒకటి. తాజాగా ఇదే జరుగుతుంది ఒక విషయంలో. ఇటీవల బాలకృష్ణ కు నాగబాబు కి మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. మెగా ఫ్యామిలీ ని బాలకృష్ణ ఏదో అనడం తో నాగబాబు కూడా కాస్త ఘాటుగానే దానికి సమాధానం ఇచ్చారు. అక్కడితో అది అయిపోయింది.
సరే బాలయ్య అభిమానులు స్పందించారు బాగానే ఉంది. కాని ఇంకా ఇంకా నాగబాబు ని టార్గెట్ చేయడం పనిలో పనిగా చిరంజీవిని తిట్టడం జరుగుతోంది. దీంతో ఓ సామాజిక వర్గంలో టీడీపీ కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక పనిలో పనిగా అన్నట్టుగా ఇదే టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీని కూడా తిడుతున్నారు. అసలే నందమూరి అభిమానులు అందరూ ఒకే సామాజిక వర్గం అనే వ్యాఖ్యలు వినపడుతూ ఉంటాయి.
అలాంటి తరుణంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన కార్యకర్తలు ఇప్పుడు సామాజిక వర్గ చిచ్చుకి కారణం అవుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక నుంచి అయినా వాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది అని సూచిస్తున్నారు పలువురు. మరి వీరి తీరు మారుతుందో ? లేదో ? చూడాలి. వీరు మారకపోతే భవిష్యత్తులో టీడీపీకి మరింత నష్టం జరగడం ఖాయం.