దేశమంతా కరోనా భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల ఇంక్రిమెంట్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులకు వచ్చే ఏడాది వరకు పెంపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీనికి సంబంధించిన విషయాలను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఒక ఆర్డర్ కూడా జారీ చేసిందన్నారు. దీంతో లక్షల మంది ఉద్యగులపై ప్రభావం పడనుంది.

 

 

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల వార్షిక పనీతీరు అంచనా.. గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఈ గడువును ఇది వరకు డిసెంబర్ 2020 వరకు మాత్రమే పొడిగించిందన్నారు. ఇప్పుడు మార్చి 31ను తాజా డెడ్‌లైన్‌గా నిర్ణయించిందని ఈ సందర్బంగా తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం మార్చి 2021 వరకు వేచి ఉండాల్సిందేన్నారు.

 

 

కేంద్ర ప్రభుత్వం జూన్ 11న విడుదల చేసిన ఆర్డర్ ప్రకారం ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో.. మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగులపై ఎఫెక్ట్ పడుతుందన్నారు. సాధారణంగా అయితే ఇప్పటికే ఇంక్రిమెంట్ల ప్రాసెస్ పూర్తి కావాల్సి ఉందన్నారు. మే చివరి కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

 

 

ఇకపోతే దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. భారత్‌లో కోవిడ్ 19 కేసులు 3.3 లక్షల పైకి నమోదైయ్యాయి. ఈ వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 9,500 పైకి చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కేసుల సంఖ్య ప్రతి రోజూ బాగా పెరుగుతూ వస్తోందన్నారు. అంతర్జాతీయంగా కరోనా కేసులు 77 లక్షల వద్ద ఉందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: