కర్ణాటక రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు వివరాలను కర్ణాటక ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను మీడియా పరంగా విడుదల చేసింది. ఇంకా బులిటెన్ ప్రకారం నేడు ఒక్కరోజే కర్ణాటకలో 210 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దీంతో రాష్ట్రంలో నేటికి 7944 కేసులు నమోదయ్యాయి. మరోవైపు నేడు ఒక్కరోజు 179 మంది రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి బయటపడి హాస్పిటల్స్ నుంచి విడుదలయ్యారు. దీనితో రాష్ట్రంలో మొత్తంగా 4983 మంది కరోనా వైరస్ నుంచి బయట పడి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నేటితో 2843 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.
Covid19 Bulletin: 18th june 2020
— cm of karnataka (@CMofKarnataka) June 18, 2020
Total Confirmed Cases: 7944
Deceased: 114
Recovered: 4983
New Cases: 210
Other information: Telemedicine facility, Instructions to Tablighi Jamaat Attendees, Corona watch application and Helpline details.1/2 pic.twitter.com/giYQh0IpWt
అయితే నేడు ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 12 మంది చనిపోయారు. ఇక దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 114 మందికి కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ ఉన్న కేసులలో 73 మందికి తీవ్ర అనారోగ్యం ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే నేడు ఒక్కరోజే విదేశాల నుంచి వచ్చిన 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 58 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు వైద్యులు.