కృషి పట్టుదల అనుకున్నది సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమే అన్న విషయం తెలిసిందే. అకుంఠిత దీక్షతో కష్టపడి చదివి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ లో గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి టాపర్ గా నిలిచారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో వైద్య విద్యను అభ్యసించిన వినీత, జూన్ 11న నిర్వహించిన పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిమ్స్ ల్లో చదువుతున్న 29 మందికి వందకు వంద మార్కులు వచ్చాయి. వినీతతో పాటు మరో ఆరుగురికి కూడా నూటికి నూరు మార్కులూ వచ్చాయి.

 

జోధ్ పూర్, రుషీకేశ్ ఎయిమ్స్ లకు చెందిన ఆరుగురికి, భోపాల్ ఎయిమ్స్ కు చెందిన ఐదుగురికి, న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చదివిన నలుగురికి కూడా 100 పర్సంటైల్ లభించింది. ఈ సందర్భంగా వినీత మాట్లాడుతూ.. తాను పీజీలో జనరల్ మెడిసిన్ ను ఎంచుకోనున్నానని, గత సంవత్సరం డిసెంబర్ లోనే తన ఎంబీబీఎస్ పూర్తయిందని తెలిపారు. ఈ పరీక్షల కోసం కష్టపడ్డానని, ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. పీజీలో ప్రవేశం కోసం ఆరు నెలల క్రితమే ప్రిపరేషన్ ను మొదలు పెట్టాను.

 

ఎంబీబీఎస్ కోర్స్ లోని స్టడీ మెటీరియల్స్ ను మరోసారి చదువుకున్నాను. ఓ యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు తీసుకుని పరీక్షకు హాజరయ్యాను" అని ఆమె వెల్లడించారు.తన పీజీ విద్యను ఢిల్లీ ఎయిమ్స్ లేదా చండీగఢ్ లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో గానీ పూర్తి చేస్తానని ఆమె అంటున్నారు. కాగా, పీజీ ఎంట్రెన్స్ లో మొత్తం 4,335 మంది ర్యాంకులను అందుకున్నారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో చదువుతున్న 74 మందికి ర్యాంకులు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: