భారత్​లో కరోనా చికిత్సకు మరిన్ని ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే గ్లెన్​ ఫార్మా, హెటిరో, సిప్లా సంస్థలు కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే కొన్ని మెడిసిన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తాజాగా అదే జాబితాలోకి చేరింది స్వదేశీ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ పతంజలి. ఈ సంస్థ వారంలో కరోనా మందును దివ్య 'కరోనిల్​' పేరిట మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డ్రగ్​పై పతంజలి రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​, నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్స్​స్​-జైపుర్​ సంయుక్తంగా పరిశోధనలు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హరిద్వార్​లోని దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్​ లిమిటెడ్​ కలిసి దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

 

క్లినికల్​ ట్రయల్స్​లో 'కరోనిల్​' పనితీరు?

'ఈ ఆయుర్వేద మందుపై పరిశోధనలకు డీసీజీఐ (డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి ఇవ్వగానే.. ఇండోర్​, జైపుర్​లో క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాం. దేశంలో కొవిడ్​-19 కేసు రాగానే.. శాస్త్రవేత్తల బృందం డ్రగ్​ తయారీలో నిమగ్నమైంది. కొంతమందికి పాజిటివ్​ వచ్చిన వ్యక్తులపై ఈ మందును ప్రయోగించాం. మూడు రోజుల పరిశీలనలో ఈ మందుతో 69 శాతం మందికి నెగిటివ్‌ వచ్చింది. అలాగే 7 రోజుల్లో 100 శాతం మంది కోలుకున్నారు. 'కరోనిల్'‌ మాత్రల ద్వారా 5 నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చు' అని వివరించారు పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ.

 

కరోనిల్‌ కిట్‌ ధరను రూ.545గా నిర్ణయించాం. ఇది 30రోజులకు సరిపోతుంది. ప్రస్తుతం ఇది అన్నిచోట్లా లభ్యం కాదు. కేవలం పతంజలి స్టోర్స్‌లోనే లభిస్తుంది. అందుకు మరో వారం రోజుల సమయం పట్టవచ్చు.

 

ఈ మందులో వాడిన అశ్వగంధ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్‌ యాసిడ్‌ పెంథాల్‌ ఈస్ట్‌ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్‌తో పోరాడే శక్తి ఉంది. ఈ ఔషధం వల్ల శరీరంలోని కణాలు.. కరోనాను ఎదుర్కోగలుగుతాయి. గిలోయ్​ మూలిక కరోనా ఇన్ఫెక్షన్​ను తగ్గిస్తుంది. తులసి కరోనా ఆర్​ఎన్​ఏపై దాడి చేసి.. వ్యాధి పెరగకుండా అదుపు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: