పెళ్లి పీటలపై నూతన వరుడు ని అరెస్ట్ చేసిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న ఆ నవ వరుడు సరిగ్గా పెళ్లి పీటలమీద తాళి కట్టిన వెంటనే పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. ఇక అది చూసి షాక్ కి గురైన వధువు అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. తన భర్త పై హత్య కేసులు ఉన్నాయని తెలిసి నూతన వధువు ఆశ్చర్యపోయింది.  పూర్తి వివరాల్లోకి వెళితే... పూణే సమీపంలోని గ్రామానికి చెందిన అక్షయ్ ఒక హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు.

 


అతను జనవరి నుంచి పోలీస్ అధికారులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇక సడన్ గా నిందితుడికి వివాహం నిశ్చయమైనట్లు పోలీసులకు సమాచారం అందడంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని గ్రామానికి చెందిన ఒక ఇన్ఫార్మర్ పోలీస్ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని తాళి కట్టిన తర్వాత భోజనాలకు రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు ఇంట్లోకి వచ్చి అతనిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

 


దీంతో పెళ్లి ఇంట్లో చాలా గందరగోళంగా ఏర్పడింది. అప్పుడే తాళికట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడం చూసి నూతన పెళ్లికూతురు ఆశ్చర్యపోయింది. ఇక వరుడి బంధువులు ఎదురు తిరగడంతో సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక పోలీస్ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇక పోలీస్ స్టేషన్ కి ఆ వధువు వచ్చి వివరాలు అడిగి తెలుసుకొని.. ఆమె పోలీసులకు ఇలాంటి కేసుల గురించి నాకు ముందు తెలియలేదు అని పోలీసు అధికారులతో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: