దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు. దింతో చాల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. అయితే మీరు రిటైర్ మెంట్ ఉద్యోగినా అయితే మీరు ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నారా...? అయితే ఇది మీకోసమే. 

 

 

అయితే ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా సులభం అంటున్నారు. ఇంట్లో కూర్చొని ఓటీపీ సాయంతో ఖాతా ప్రారంభించొచ్చున్నారు. పీఎఫ్ఆర్‌డీఏ ఇటీవల ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెనింగ్‌కు సంబంధించి రూల్స్‌ సవరించిందని తెలియజేశారు. వన్ టైమ్ పాస్‌‌వర్డ్ సాయంతో అకౌంట్ తెరవొచ్చని పేర్కొన్నారు.

 

 

అయితే బ్యాంక్ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ సాయంతో ఓటీపీ ద్వారా ఇంట్లో కూర్చొని ఎన్‌పీఎస్ ఖాతా తెరవొచ్చునన్నారు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి రూ.45 లక్షలు పొందొచ్చునన్నారు. ఇంకా ప్రతి నెలా రూ.22,500 పెన్షన్ కూడా తీసుకోవచ్చునన్నారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకుందా మరి.

 

 

అయితే దీని కోసం మీరు ప్రతి నెలా రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలన్నారు. ఇలా మీరు 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలన్నారు. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.60 వేలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుందన్నారు. ఇలా 30 ఏళ్లలో మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.18 లక్షలు అవుతుందని తెలియజేశారు. 8 శాతం రాబడి ప్రకారం చేస్తే.. మీ మెచ్యూరిటీ మొత్తం రూ.75 లక్షలుగా ఉంటుందన్నారు.

 

 

అయితే రూ.75 లక్షల్లో రూ.45 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చునన్నారు. ఇక మిగతా మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నారు. దీనిపై పెన్షన్ లభిస్తుందని తెలిపారు. 8 శాతం యాన్యుటీ రేటు ప్రకారం చూస్తే.. మీకు 60 ఏళ్ల నుంచి నెలకు రూ.20 వేల పెన్షన్ వస్తుందన్నారు. ఇక్కడ ఎన్‌పీఎస్ స్కీమ్‌లోని మొత్తంలో 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలనే నిబంధన ఉంటుందని యాజమాన్యం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: