దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కామంతో రెచ్చిపోతున్న కామాంధుల ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్లదాకా అందరిపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. రోజుకు ఎదో ఒక్క ప్రాంతంలో మహిళలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు.

 

 

సామాన్య ప్రజల నుండి ఉన్నత స్థాయి మహిళల వరకు అందరి వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అఘాయిత్యాలను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు అమలులోకి తీసుకొచ్చిన కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడంలేదు. కామాందుడి చేతిలో మరో మహిళ బలి అయినా ఘటన హైదరాబాద్‌లోని జియాగూడలో చోటు చేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. కొత్త ఇంట్లో పూజ పేరుతో వివాహితపై ఓ యువకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన ఘటన హైదరాబాద్‌లోని జియాగూడలో వెలుగు చూసింది. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జియాగూడ కేశవస్వామినగర్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొత్త ఇల్లు కట్టుకున్నారు. కాంట్రాక్టర్‌ వెంకటేశ్‌, అతని సోదరుడు మేస్త్రీ అయిన శ్రీహరి, భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి కొత్త ఇంట్లో సంప్రదాయం ప్రకారం తండ్గా అనే శాంతిపూజ, దావత్‌ చేసుకుంటామని కోరడంతో ఇంటి యజమాని అంగీకరించారు.

 

 

దీంతో అందరూ కలిసి రాత్రివేళ మద్యం తాగుతూ దావత్ చేసుకున్నారు. ఈ దావత్‌కు మేస్త్రీ శ్రీహరి.. తన స్నేహితుడైన రాజేంద్రనగర్‌ రాంబాగ్‌ ప్రాంతానికి చెందిన రవి (30)ని కూడా ఆహ్వానించారు. మద్యం ఎక్కువగా సేవించిన రవి అర్ధరాత్రి సమయంలో సిగరెట్‌ తాగుతానని బిల్డింగ్ ఫస్ట్‌ ఫ్లోర్‌కి వెళ్లాడు.

 

 

అయితే అక్కడ నిద్రిస్తున్న ఇంటి యజమాని భార్య(47)ను చూసి కామంతో రగిలిపోయాడు. ఆమె చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయడంతో కంగారుపడి ఆమె చీరతోనే గొంతు బిగించి చంపేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రవితో పాటు మేస్త్రీ శ్రీహరి, కాంట్రాక్టర్‌ వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: