దేశంలో కరోనా ఫిబ్రవరి మాసంలో మొదలైంది.. దాంతో మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. ఇక ఈ లాక్ డౌన్ వల్ల జనసంచాం పూర్తిగా తగ్గిపోయింది. రవాణా వ్యవస్థ కుదేలైంది. లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి పట్టాలెక్కని హైదరాబాద్ మెట్రో క్రమంగా నష్టాల్లో కూరుకుపోతోంది. సర్వీసులు నిలిచిపోయినా రైళ్లు, స్టేషన్ల నిర్వహణ వ్యయం నెలకు రూ. 50 కోట్ల వరకు అవుతోంది.  ఇటీవల కాలంలో లాక్ డౌన్ సడలించినా.. ప్రజలు ప్రయాణాలు అంటే భయపడిపోతున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఈ నెలాఖరు నాటికి మెట్రో నష్టం రూ. 200 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సర్వీసుల పునఃప్రారంభానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే రైళ్లు కదలాల్సి ఉంటుంది.

 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రోకు అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యమేనని చెబుతున్నారు. నగరంలోని మూడు మార్గాల్లో కలిపి రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణించేవారు. లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి సేవలు నిలిచిపోయాయి. సర్వీసులు లేకపోయినా రైళ్లు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు తప్పనిసరి కావడంతో అందుకు నెలకు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.

 

ఈ నేపథ్యంలో  సంస్థకు పెను భారంగా మారడంతో కొవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని భరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఉన్నతాధికారులు లేఖ రాసినట్టు తెలుస్తుంది.  అయితే, గత నాలుగు నెలలుగా ఇవేవీ లేకపోవడంతో మెట్రో నష్టాల బారిన పయనిస్తోంది. మరి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: