ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు ఓ కామాంధుడు. బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందుతుడి భయపడి పారిపోయిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

 

 

ఈ నెల 8వ తేదీన వారి కుమారై(9)ను ఇంటి వద్దనే ఉంచి దంపతులిద్దరు పొలం పనులకు బయలు దేరారు. మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించిన అదే గ్రామానికి చెందిన శివప్రసాద్(22). ఇంట్లోకి చొరబడి బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతుండగా భయంతో బాలిక గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టింది. దీంతో భయపడిన శివప్రసాద్ అక్కడి నుంచి పరారయ్యాడు.

 


బాలిక కేకలు విన్న స్థానికులు అప్రమత్తమై వెంటనే అక్కడికి చేరుకుని బాలికను ఇంటికి తరలించారు.  పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులకు బాలికపై జరిగిన ఘటన తెలిసి గ్రామ పంచాయతీ పెద్దలకు తెలిపారు. గ్రామ పెద్దల సలహా మేరకు బాలిక తల్లిదండ్రులు గురువారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు శివప్రసాద్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.

 

 

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, గతంలో శివప్రసాద్ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పలు మార్లు శిక్షించినా తనలో మార్పు రాలేదన్నారు.  మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడని వారు అన్నారు. రోజు రోజుకు బాలికపై అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయని, నిందితులను శిక్షించడానికి ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. నిందితుడికి కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: