మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాంపై ఫిర్యాదుల పర్వం  కొనసాగుతోంది. ఇప్పటి వరకు వివిధ వర్గాల వారు కోడెల శివరాంపై ఫిర్యాదు చేయగా , తాజాగా  సొంత పార్టీ నేతే ఫిర్యాదు చేయడం గమనార్హం.  ఓ కాంట్రాక్టు విషయంలో కోడెల శివరామ్‌ తనను మోసం చేశారంటూ టీడీపీ నేత శివరామయ్య పోలీసులను ఆశ్రయించారు.కోడెల శివరామ్  ఏడు లక్షల రూపాయలు ఇస్తేనే పని చేయనిస్తానని తనను బెదిరించారని, ఆ తర్వాత డబ్బు తీసుకుని కూడా కాంట్రాక్టును రద్దు చేయించారని ఆరోపించారు. ఈ మేరకు శివరామ్‌తో పాటుగా ఆయన అనుచరులపై  నరసారావుపేట వన్‌టౌన్‌ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.


ఇకపోతే ఇప్పటి వరకు కోడెల శివరాంపై 12 కేసులు నమోదయ్యాయి. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా పనిచేస్తున్న సమయంలో కే ట్యాక్స్‌ పేరుతో నియోజకవర్గంలో కోడెల శివరాం కుమార్తె కోడెల విజయలక్ష్మీలు వసూళ్లకు పాల్పడ్డారంటూ ప్రచారం జరుగుతోంది. వివిధ వర్గాల వారు ఈ మేరకు పోలీసులను ఆశ్రయించడంతో , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . కోడెల కుమారుడు, కుమార్తె అక్రమ వసూళ్ల పై వైకాపా ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది . ఈ విషయం లో బాధితుల పక్షాన్నే నిలిచి , వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేయాలని భావిస్తోంది .


టీడీపీ అధికారం లో ఉన్నప్పుడే కోడెల కొడుకు , కూతురు అక్రమాల భాగోతం బయటకు వచ్చిందని , బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది . అయితే కోడెల స్పీకర్ గా ఉండడం తో కనీసం కేసులు నమోదు చేసుకునేందుకు కూడా పోలీసులు సాహసం చేయకుండా , బాధితుల్ని వెనక్కి తిప్పి పంపారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి నూతన ప్రభుత్వం ఏర్పడగానే బాధితులంతా మరొకసారి  పోలీసులను ఆశ్రయించారు . ప్రస్తుతం ప్రభుత్వ పెద్ద ఒత్తిళ్లేమీ లేకపోవడం తో పోలీసులు స్వేచ్ఛగా  కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: