స‌మాజంలో పెరిగిపోతోన్న విప‌రీత పోక‌డ‌ల‌తో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చివ‌ర‌కు ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో చ‌దువుతున్న అమ్మాయిల‌ను సైతం ముగ్గు వేసి ముగ్గులోకి దింపి వారి బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌ర‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా ఫ్రెండ్ షిప్ పేరుతో ఓ అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. చివ‌ర‌కు ఈ దారుణాన్ని వీడియో తీసి బ‌య‌ట‌కు చెపితే సోష‌ల్ మీడియాలో పెడ‌తామ‌ని ఆమెను బెదిరించి ప‌లుమార్లు లైంగీక దాడికి పాల్ప‌డ్డారు.


అత్యంత ఈ అమానుష సంఘ‌టన గుంటూరు జిల్లాలో జ‌రిగింది. బాధితురాలు న‌గ‌ర స‌మీపంలోని ఓ ఇంజ‌నీరింగ్ కాలేజ్ స్టూడెంట్‌. గుంటూరు జిల్లాలోని పేరేచర్లలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అదే ప్రాంతానికి చెందిన యువతి చదువుతోంది. ఆమె ప్ర‌తి రోజు కాలేజ్‌కు వెళ్లి వ‌స్తుంటుంది. ఆమెతో ప‌రిచ‌యం పెంచుకున్న ఓ యువ‌కుడు ఆమెతో స్నేహం పేరుతో బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ యువ‌తి కూడా ఆ యువ‌కుడిని న‌మ్మ‌డంతో పాటు ప‌లుసార్లు అత‌డి బైక్ ఎక్కి బ‌య‌ట‌కు వెళ్లేది.


ఈ క్ర‌మంలోనే ఓ రోజు ఆ యువ‌తిని బైక్‌పై కాస్త నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకువెళ్లాడు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడకు పిలిపించాడు. ఆ యువకుడితో పాటు అత‌డి స్నేహితుడు ఇద్ద‌రూ క‌లిసి ఆమెను బ‌ల‌త్కారం చేయ‌బోయారు. ఆమె ప్ర‌తిఘ‌టించినా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ తతంగాన్ని ఇద్దరూ వీడియో తీశారు. ఈ విషయాన్ని బ‌య‌ట‌పెడితే ఈ వీడియో ఫేస్‌బుక్‌లో పెడ‌తామ‌ని చెప్ప‌డంతో ఆమె భ‌య‌ప‌డిపోయింది.


ఈ వీడియో చూపించి ఆమెను ప‌లుమార్లు బెదిరించి ఆమెపై చాలాసార్లు లైంగీక దాడికి పాల్ప‌డ్డారు. ఇటీవ‌ల ఆ యువ‌తి అనారోగ్యానికి గురైంది. అప్ప‌టి వ‌ర‌కు త‌న‌లో తానే కుమిలిపోయిన ఆ యువ‌తి చివ‌ర‌కు అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో యువతి తల్లిదండ్రులు గుంటూరు అర్బన్ ప‌రిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: