సమాజంలో పెరిగిపోతోన్న విపరీత పోకడలతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చివరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలను సైతం ముగ్గు వేసి ముగ్గులోకి దింపి వారి బలహీనతలను ఆసరగా చేసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా ఫ్రెండ్ షిప్ పేరుతో ఓ అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. చివరకు ఈ దారుణాన్ని వీడియో తీసి బయటకు చెపితే సోషల్ మీడియాలో పెడతామని ఆమెను బెదిరించి పలుమార్లు లైంగీక దాడికి పాల్పడ్డారు.
అత్యంత ఈ అమానుష సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. బాధితురాలు నగర సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. గుంటూరు జిల్లాలోని పేరేచర్లలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అదే ప్రాంతానికి చెందిన యువతి చదువుతోంది. ఆమె ప్రతి రోజు కాలేజ్కు వెళ్లి వస్తుంటుంది. ఆమెతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు ఆమెతో స్నేహం పేరుతో బాగా దగ్గరయ్యాడు. ఆ యువతి కూడా ఆ యువకుడిని నమ్మడంతో పాటు పలుసార్లు అతడి బైక్ ఎక్కి బయటకు వెళ్లేది.
ఈ క్రమంలోనే ఓ రోజు ఆ యువతిని బైక్పై కాస్త నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడకు పిలిపించాడు. ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను బలత్కారం చేయబోయారు. ఆమె ప్రతిఘటించినా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ తతంగాన్ని ఇద్దరూ వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటపెడితే ఈ వీడియో ఫేస్బుక్లో పెడతామని చెప్పడంతో ఆమె భయపడిపోయింది.
ఈ వీడియో చూపించి ఆమెను పలుమార్లు బెదిరించి ఆమెపై చాలాసార్లు లైంగీక దాడికి పాల్పడ్డారు. ఇటీవల ఆ యువతి అనారోగ్యానికి గురైంది. అప్పటి వరకు తనలో తానే కుమిలిపోయిన ఆ యువతి చివరకు అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో యువతి తల్లిదండ్రులు గుంటూరు అర్బన్ పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.