తెలంగాణలో మరో విషాదం చోటు చేసుకుంది.  ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుకున్న రాజకీయ నేత సీనియర్ నాయకులు నాగార్జున సాగర్(చలకుర్తి) మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకులు గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు.  గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

తెలంగాణలో రామ్మూర్తి యాదవ్ తెలియని వారు ఉండరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1994-99 మధ్య చలకుర్తి ఎమ్మెల్యేగా రామ్మూర్తి యాదవ్ పని చేశారు.  తెలంగాణ పోరాట సమయంలో రామ్మూర్తి యాదవ్ తన పోరాట స్ఫూర్తిని చూపించారు. 

ఎంతో మంది యువతకు ఏకం చేసి ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు.  రామ్మూర్తి మృతిపట్ల టీఆర్‌ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: