ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు రోజుల నుంచి కాల్ మనీ వ్యవహారం పై సాగుతున్న దుమారంపై నగరి ఎమ్మెల్యే రోజు చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ ఆమెను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆమె శనివారం అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్ ఆపివేడయం బయటకు పంపడం జరిగింది. అయితే ఈ సందర్భంటా పోలీసులకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది.



ఈ సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఈ దోపుటాటలో ఎమ్మెల్యే రోజా కింద పడిపోయినట్లు అక్కడ నుంచి ఆమెను బలవంతంగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం. ఆమె స్టేషన్ కి వెళ్లే లోపే స్పృహ కోల్పోయారని దాందో ఆహెను పోలీస్ స్టేషన్ నుంచి నీమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: