ఈ మద్య మహిళల పట్ల కొంత మంది ఆకతాయిలు, పోకిరీలు బాగా రెచ్చిపోతున్నారు.  ఒంటరిగా మహిళలు, యువతులు కనిపిస్తే చాలు చిత్త కార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు. భారత దేశంలో ప్రతిరోజూ ఎదో ఒక మూల యువతులపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్తలు చదువుతూనే ఉన్నాం. వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంత మంది కామాంధులు చేస్తున్న రాక్షక క్రీడను అరికట్ట లేక పోతున్నారు.

దేశంలో పోకిరిల భరతం పట్టాడానికి మహిళలే ముందుకు రావాలని స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు అంటున్నాయి. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం ఆడవాళ్లను తాకుతూ అనందం పొందుతుంటారు కొంతమంది. అలా చేసిన  ఓ పోకిరిగాడికి వీరలెవెల్లో కోటింగ్ ఇచ్చి భలే బుద్ది చెప్పింది ఓ మహిళ. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ యువకుడిని కాలితో తన్నుతూ, అటూ ఇటూ తిప్పుతూ పిచ్చి కొట్టుడు కొట్టింది.

ఇందులో  ట్విస్ట్ ఏమిటంటే ఆ సమయంలో పక్కనే మగవాళ్లు ఉన్న కూడా పెద్దగా పట్టించుకోలేదు. . వీళ్ల ఫైటింగ్ స్టార్ట్ కాగానే తోటి ప్రయాణికులు అందరూ పారిపోయారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమనిచి పోకిరిని భరతం పట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: