తమిళనాడులో ప్రస్తుతం రాజకీయాలు బాగా వేడీవాడీగా కొనసాగుతున్నాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు పోటా పోటీగా ప్రచారాలు మొదలు పెట్టాయి. ఇక పొత్తులు, బుజ్జగింపులు, పార్టీ ఫిరాయింపుల పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడు సీఎం జయలలిత ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే కొత్త కొత్త పథకాలు తీసుకు వస్తూ ప్రజలను ఆకర్శించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇక తమిళనాడు రాజకీయాలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి ఎండీఎంకే పార్టీ నేత వైగో. తాజాగా వైగో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేస్తి వార్తల్లోకి ఎక్కారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ లో జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ…ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ ను ప్రస్తావించారు.

ఎర్రచందనం కూలీల పేరిట 20 మంది అమాయక తమిళ కూలీలను చంద్రబాబు ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ విషయంలో ఎవరైనా ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని  ఎన్ కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును మేము అదికారంలోకి వస్తే జైలుకు పంపుతామని ఆయన సంచలన ప్రకటన చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: