మహిళాదినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న వేళ.. మహిళపై మరో ఘాతుకం వెలుగు చూసింది. ఇటీవల మహిళలపై దారుణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న బెంగళూరులోనే ఈ ఘటన కూడా జరిగింది. కొడుకు కళ్ల ఎదురుగానే అతని తల్లిని ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. 

బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పరిధిలోని నాయకనహళ్లిలో ఈ దారుణం జరిగింది. కుటుంబ వివాదాల కారణంగా 14 ఏళ్ల కుమారుడితో జీవిస్తోన్న 35 ఏళ్ల తల్లిపై ఆమె కుటుంబంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు దారుణంగా మాన భంగం చేసినట్టు తెలుస్తోంది. ఐతే.. కుటుంబ కక్షల కారణంగానే ఈ దారుణం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ దారణ కాండలో కీలక పాత్ర వహించిన వ్యక్తి స్థానిక జిల్లా పంచాయతీ సభ్యుడు కావడం విశేషం. అతని పేరు సంతోష్ రెడ్డి. ఆయన తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంటబెట్టుకుని ఈనెల 6 అర్థరాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లారు. కుటుంబ వివాదం విషయం మాట్లాడుతూనే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమె 14 ఏళ్ల కొడుకుని బంధించి.. అతని ఎదురుగానే గ్యాంగ్ రేప్ చేశారు. 

అంతటితో ఆగని ఆ దుర్మార్గులు ఆ తతంగాన్నంతా సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ఈ దారుణం గురించి ఎవరికైనా చెబితే ఈ వీడియో బయటపెడతామని బెదిరించడంతో బాధితురాలు మొదట పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయింది. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు అండగా నిలవడంతో ఆ కామ పిశాచులపై కేసు పెట్టింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సంతోష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: