ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. ఉద్యమ పోరులో అందరికీ ఆదర్శంగా నిలిస్తూ అలుపెరుగని పోరాటయోధుడిగా ముందుకు సాగిన కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. అంతే కాదు ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై ఆ మద్య వరంగల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో..మొన్నామద్య జరిగిన జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఇలా ఎక్కడ చూసినా అధికార పార్టీ కే పట్టం కట్టారు.

అంతే కాదు ఈ మద్య టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే..వారిలో టీడీపీ టికెట్ పై విజయం సాధించిన ప్రకాశ్ గౌడ్ ఇటీవలే  టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నేటి ఉదయం గుండెపోటుకు గురయ్యారు. మైలార్ దేవ్ పల్లి పరిధిలోని దుర్గా నగర్ లోని తన సొంతింటిలో నేటి ఉదయం ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రకాశ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: