మద్యమత్తులు చిందేసిన పోకిరీలు అని సర్వసాధారంగా వింటుంటాం..కానీ ఈ మద్య మద్యం మత్తులు అమ్మాయిలు తెగ హల్ చల్ చేస్తూ  వార్తల్లో నిలిచారు. అమ్మాయిలు అంటే చాలా గౌరవంగా హుందాగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ మద్య పార్టీ కల్చర్ బాగా పెరిగిపోయింది..దీంతో యూత్ పార్టీలో మద్యం, సిగరెట్లు తాగేసి చిందులేస్తున్నారు.  తాజాగా ఓ నేపాల్ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్పై చేయిచేసుకుంది. ఆదివారం ఉదయం మునిర్కాలో నేపాల్ యువతి (28) ఆటో ఎక్కింది.

ఇక డ్రైవర్ కి చుక్కులు చూపిస్తూ అటు ఇటూ వెళ్లాలని చెబుతూ డ్రైవర్ ని బండ బూతులు తిడుతూ అనుచితంగా ప్రవర్తించింది. దీంతో ఆటో డ్రైవర్ పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. ఆటో నుంచి దిగకుండా సతాయిస్తోందని, తనను కొడతానంటూ బెదిరిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అంతే కాదు ఆటోను తీసుకెళ్లి వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆపాడు.  

పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేస్తున్న యువతి


పోలీస్ స్టేషన్ కి చేరుకున్న ఈ అమ్మడు ఇంకా రెచ్చిపోయింది..పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతూ నానా హంగామాచేసింది. అంతే కాదు తను పట్టుకోవడానికి వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించింది. పోలీసులు నేపాల్ యువతిని అదుపులోకి తీసుకుని వైద్యపరీక్ష కోసం సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మద్యంతాగినట్టు పరీక్షల్లో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: