ఈ మద్య మనిషి చేస్తున్న వేలం వెర్రి పనులతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సెల్పీ జమానా వచ్చిన తర్వాత ఈ జాడ్యం కాస్త మరీ ముదిరిపోతుంది. సెల్ఫీ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ప్రతి ఆదివారం నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతున్న సమయంలో ముఖేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో సింహాల సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు.

సింహాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్న ముఖేష్


అంతే కాదు అందరూ చూస్తుండగానే సెక్యూరిటీ  కళ్లుగప్పి ఎన్ క్లోజర్‌లోకి ప్రవేశించిన ఆ సందర్శకుడు సింహానికి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.వెంటనే గమనించిన జూలాజికల్ పార్క్ అధికారులు సమయస్ఫూర్తితో సింహాలను కంట్రోల్ చేసి అతన్ని కాపాడారు. సదరు వ్యక్తి రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ముఖేశ్(35) ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ప్రాజెక్టులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.  

ముఖేష్ ని కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది



మొత్తం మీద సాయంత్రం 4.45 గంటలకు ఎన్‌క్లోజర్‌లోకి  ప్రవేశించిన ముఖేశ్‌ను సాయంత్రం 5.15 గంటలకు బయటికి తీసుకొచ్చారు.ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో జూకు వచ్చిన సందర్శనకులు ఈ పరిమాణంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. జూ అధికారులు అతన్ని అదుపులోకి విచారిస్తున్నారు.


 



మరింత సమాచారం తెలుసుకోండి: